telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

కంగనాకు హిమాచల్ ప్రదేశ్ సీఎం సపోర్ట్

Kangana

బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణం తర్వాత ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ బాలీవుడ్ లోని పలువురిపైన చేస్తున్న ఆరోపణలు సంచలనం రేపుతున్నాయి. ఈ కేసులో ముంబై పోలీసులపై నమ్మకం లేదని ఆమె కీలక వ్యాఖ్యలు చేయడంపై శివసేన ఎంపీ సంజయ్ రౌత్ స్పందించారు. ఈ క్రమంలో శివసేన ఎంపి సంజయ్ రౌత్ తనను బెదిరించారని కంగానా తన ట్విట్టర్ వేదికగా ఆరోపించారు. ముంబైని పీఓకేతో పోల్చే వారికి పీఓకే గురించి ఏమీ తెలియదని చెప్పారు. ముంబైని కానీ, మహారాష్ట్రను కానీ కించపరుస్తూ మాట్లాడితే తాము సహించబోమని అన్నారు. దీంతో కంగనా, సంజయ్ రౌత్ మధ్య వివాదం ముదురుతోంది. ఈ నేపథ్యంలో హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం కంగనకు సపోర్ట్ గా నిలిచింది. మనాలిలోని కంగన కుటుంబానికి భద్రత కల్పించింది. కంగన హిమాచల్ ప్రదేశ్ బిడ్డ అని ఆమె రక్షణ బాధ్యత తమదే అని హిమాచల్ ప్రదేశ్ సీఎం జైరాం ఠాకూర్ పేర్కొన్నారు. కంగనకు అవసరమైతే బయట రాష్ట్రంలో కూడా భద్రత కల్పిస్తామని అన్నారు. ఇక కంగనకు వై కేటగిరి భద్రత కల్పించాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది. కేంద్రం తీసుకున్న నిర్ణయంపై కంగన హర్షం వ్యక్తం చేసింది. మహిళకు తగిన గౌరవం దక్కిందని, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు కంగన కృతజ్ఞతలు తెలిపింది.

Related posts