కర్ణాటక సీఎం కుమారస్వామి తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని బీజేపీ నేత యడ్యూరప్ప డిమాండ్ చేశారు. మద్దతు లేని కారణంగా కుమారస్వామి తన పదవికి రాజీనామా చేయాలని అన్నారు. పదిహేను మంది కాంగ్రెస్, జేడీఎస్, ఇద్దరు స్వతంత్ర అభ్యర్థులు తమ పదవులకు రాజీనామా చేశారని చేపరు.
రాజీనామా చేసిన ఎమ్మెల్యేలు బీజేపీకు సానుకూలంగా ఉన్నారని అన్నారు. రెబల్ ఎమ్మెల్యేల రాజీనామాలపై స్పీకర్ వెంటనే నిర్ణయం తీసుకోవాలని యడ్యూరప్ప నిన్న డిమాండ్ చేశారు. అవిశ్వాసతీర్మానం పెట్టేందుకు ఎలాంటి అభ్యంతరం లేదని, స్పీకర్ వెంటనే బలపరీక్షకు ఆదేశించాలని డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే.