విశాఖపట్నం లోక్ సభ నుంచి జనసేన పార్టీ తరఫున బరిలోకి దిగిన సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణ, తన ఓటమిపై ట్విట్టర్ లో స్పందించారు. ప్రజలు ఇచ్చిన తీర్పును తాను గౌరవిస్తున్నానని అన్నారు. విజయం సాధించిన నరేంద్ర మోదీ, జగన్ లకు అభినందనలు తెలిపారు.
తనపై విజయం సాధించిన ఎంవీవీ సత్యనారాయణను అభినందించారు. కొత్త ప్రభుత్వాలు ప్రజల ఆకాంక్షలను నెరవేర్చాలని కోరుకుంటున్నట్టు తెలిపారు. తనకు ఓటేసిన వారికి కృతజ్ఞతలు చెప్పారు. ప్రజలకు సేవ చేసేందుకు తనపని తాను చేసుకు ముందుకెళ్తానని అన్నారు.
s