*జగన్నతోడు పథకం నిధులు విడుదల..
*చిరువ్యాపారులకు, చేతివృత్తులు వారికి వడ్డీలేని రుణం ..
*పూర్తి ఒడ్డీ భారాన్ని ప్రభుత్వం భరిస్తుంది.
*చిరు వ్యాపారులకు అండగా నిలవడమే ఈ పథకం లక్ష్యం
*ఒక్కో చిరు వ్యాపారికి రూ.10వేలు రుణం..
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇక జగనన్న తోడు పథకం కింద మూడో విడత చిరు వ్యాపారులకు వడ్డీలేని రుణాలను పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు.సోమవారం తన క్యాంపు కార్యాలయంలో లాంఛనంగా ప్రారంభించారు. చిన్న వ్యాపారులు మరో 5,10,462 మందికి ప్రభుత్వం రూ.510.46 కోట్ల వడ్డీ లేని రుణాల పంపిణీకి శ్రీకారం చుట్టింది.
మూడో విడత రుణాల పంపిణీ కార్యక్రమంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మాట్లాడుతూ.. చిరు వ్యాపారులకు అండగా నిలవడమే జగనన్న తోడు లక్ష్యమని తెలిపారు. చిరు వ్యాపారులు తమకు తాము ఉపాధి కల్పించుకోవడం గొప్ప విషయమని అన్నారు. లక్షల మంది చిరు వ్యాపారులు స్వయం ఉపాధి పొందుతున్నారని పేర్కొన్నారు. వారి కాళ్లమీద వారు నిలబడడానికి ఎంతగానో ఈ పథకం ఉపయోగపడుతుందని అన్నారు.
పాదయాత్రలో చిరు వ్యాపారుల కష్టాలు చూశానని సీఎం వైఎస్ జగన్ తెలిపారు. చిరు వ్యాపారులకు ఏదైనా చేయాలనే ఉద్దేశంతోనే జగనన్న తోడు పథకం తీసుకొచ్చామని అన్నారు. పూర్తి వడ్డీ భారాన్ని ప్రభుత్వమే భరిస్తూ ఒక్కొక్కరికి రూ.10వేల రుణం అందజేస్తోందని తెలిపారు.
రుణాలు క్రమం తప్పకుండా చెల్లిస్తుంటే మీకు మళ్లీ రుణం ఇస్తామని తెలిపారు. ఇప్పటి వరకూ 14 లక్షల మందికి మంచి చేయగలిగామని అన్నారు. మూడో విడత కింద 5,10,462 మంది చిరు వ్యాపారులకు లబ్ధి చేకూరనుందని తెలిపారు.
అలాగే..అర్హులై ఉండి రుణం రాకపోతే.. కంగారుపడాల్సిన పనిలేదు..మీ గ్రామ సచివాలయాల్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. లబ్ధిదారులకు సందేహాలుంటే 08912890525కు కాల్ చేసి నివృత్తి చేసుకోవచ్చని తెలిపారు.