విశాఖలో నిర్వహించిన రోడ్ షో లో చంద్రబాబు మాట్లాడుతూ… పథకాల పేరు చెప్పి నిత్యావసర వస్తువుల ధరలు పెంచేసి దోచుకుంటున్నారని అన్నారు. స్టీల్ప్లాంట్ కోసం జరిగిన త్యాగాలకు గౌరవం లేకుండా చేశారని, స్టీల్ప్లాంట్ భూములను విక్రయించాలని సీఎం చూస్తున్నారని అన్నారు. భూములను కబ్జా చేయడానికే వైసీపీ నాయకులు ఉన్నారని అన్నారు. A2 విజయసాయి రెడ్డికి ఇక్కడేం పని అని ఆయన ప్రశ్నించారు. భూమి విలువ చూసిన సీఎంకు త్యాగం విలువ తెలియదని అన్నారు. విశాఖ ఎన్నికలు రాష్ట్రానికి స్ఫూర్తిగా నిలవాలన్న ఆయన ఎన్నికల సమయంలో ప్రత్యేక హోదా, రైల్వేజోన్ను తీసుకొస్తామని చెప్పి వైసీపీ మోసం చేసిందాని అన్నారు. వర్ట్ చేసి మూడు రాజధానుల ముచ్చట తెరపైకి తెచ్చారని అన్నారు. ఎక్కడ ఉన్న వాళ్లను తీసుకొచ్చి రెండు సార్లు ఎమ్మెల్యేగా చేశానని కష్టకాలంలో పార్టీకి అండగా ఉండాల్సిన వ్యక్తి పార్టీకి మోసం చేసి వెళ్ళిపోయాడు అంటే మీరే ఆలోచించండని అన్నారు. విశాఖలో మేయర్ ను గెలిపిస్తే అన్న క్యాంటిన్లు ఓపెన్ చేస్తామని ఈ ప్రభుత్వం మద్యపాన నిషేధం కాదు దాని మీద అప్పులు తేవాలని చూస్తున్నారని అన్నారు. ఉన్మాది ముఖ్యమంత్రి వల్ల మీరు ఇబ్బంది పడుతున్నారు మేము ఇబ్బంది పడుతున్నామని అన్నారు. విజయసాయిరెడ్డి పనికిమాలిన వ్యక్తి కరడుగట్టిన నేరస్థులు దొంగ లెక్కలు రాయడం లో సిద్ధహస్తుడు, విశాఖలో భూములు కబ్జా చేస్తున్నారు. ప్రైవేట్ భూములు తో సహా ఏమీ విడిచిపెట్టలేదని అన్నారు.
previous post
ప్రజలు ఇచ్చే తీర్పుతో జగన్ వెన్నులో వణుకు పుట్టాలి: వంగవీటి రాధా