telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

అమిత్ షాని పవన్ ప్రశంసించడం సంతోషమే: బీజేపీ ఎంపీ టీజీ వెంకటేశ్

TG Venkatesh MP

జనసేన అధినేత పవన్ కల్యాణ్ కేంద్ర మంత్రి అమిత్ షాను ప్రశంసించడం సంతోషమని బీజేపీ ఎంపీ టీజీ వెంకటేశ్ అన్నారు. ఢిల్లీలో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ జనసేనను బీజేపీలో విలీనం చేస్తారా అన్న ప్రశ్నకు ఆయన స్పందిస్తూ, అమిత్ షాని పవన్ ప్రశంసించడం సంతోషమే కానీ, తమతో కలిసి ఆయన పోరాడతారా అనేదే అసలు ప్రశ్నఅని అన్నారు.

కర్నూల్ ను స్మార్ట్ సిటీ చేయాలని కేంద్రాన్ని కోరానని బీజేపీ ఎంపీ టీజీ వెంకటేశ్ అన్నారు. రాష్ట్రం నుంచి ప్రతిపాదనలు అందితే పరిశీలిస్తామని కేంద్రం చెప్పిందని అన్నారు. కేంద్రం నుంచి నిధులు విడుదలైనప్పటికీ కర్నూలులో అభివృద్ధి నత్తనడకన సాగుతోందని విమర్శించారు. ఏపీకి కేంద్రం ప్రత్యేక సాయం చేస్తానంటోందని అన్నారు.

Related posts