సీఎం కేసీఆర్ మాటలు కోటలు దాటుతున్నాయి.. కానీ పనులు ప్రగతి భవన్ దాటడం లేదని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. గ్రేటర్ ఎన్నికల్లో భాగంగా ఆయన మల్కాజిగిరిలో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత ghmc ఎన్నికల్లో మాకు ఓటు వేస్తే డబుల్ బెడ్ రూమ్ ఇస్తామన్నారని.. ఇప్పటి వరకు ఒక్కరి కూడా డబుల్ బెడ్ రూమ్ ఇవ్వలేదని ఫైర్ అయ్యారు. ghmc ఎన్నికల్లో అందరూ ఆలోచన చేసి ఓటు వేయాలని కోరారు. 4 నెలలలో కేసీఆర్ ప్రగతి భవన్ కట్టుకున్నాడు కానీ.. 6 ఏండ్లు అవుతున్న సామాన్య జనాలకు మాత్రం డబుల్ బెడ్ రూమ్ ఇవ్వలేదని మండిపడ్డారు. పొదుపు సంఘాలకు 20 లక్షల రుణాలు ఇప్పిస్తుంది మోడీ ప్రభుత్వం అని…. mmts తీసుకు వచ్చింది బీజేపీ ప్రభుత్వం అని తెలిపారు. ప్రభుత్వం వరద బాధితులకు 10 వేలు ఇస్తే వెనుక నుండి trs నాయకులు 5 వేలు తీసుకున్నారని ఆరోపణలు చేశారు. 40 మంది చనిపోతే ఒక్క కుటుంబాన్ని కూడా కేసీఆర్ పరామర్శించలేదని….కష్టాలలో ఉన్న వారిని మా అభ్యర్థులను ఆదుకున్నారని తెలిపారు. ghmc ఎన్నికల్లో డబ్బులతో గెలవాలని trs చూస్తుందని… దుబ్బాక లో గెలిచినట్టు ghmcలో కూడా గెలుస్తామన్నారు. కల్వకుంట్ల కుటుంబం, ఒవైసీ కుటుంబ పాలన పోవాలని… ఈ ఎన్నికల లో trs ఓడిపోవడం ఖాయమన్నారు. ఈ ఎన్నికల తర్వాత ktr కూడా అమెరికా కు పోవడం ఖాయమని ఎద్దేవా చేశారు.
previous post