జమర్దస్త్ షోతో అందరికీ సుపరిచితమైన అససూయ తన నటనా జీవితంపై ఇప్పుడిప్పుడే దృష్టి సారిస్తోంది. స్టార్ దర్శకుడు సుకుమార్, మెగాపవర్ స్టార్ రాంచరణ్ కాంబోలో వచ్చిన రంగస్థలం సినిమాలో రంగమ్మత్తగా అందరిని మెప్పింది. దాంతో అనూకి క్రేజ్ బాగా పెరిగింది. అప్పటినుంచి వరుస సినిమాలు చేస్తూ అబ్బుర పరుస్తోంది. ఇటీవల ఓ తమిల సినిమాకు ఓకే చెప్పింది. అందులో స్టార్ హీరో విజయ్ సేతుపతి సరసన ఈ భామ చేయనుందట. అంతేకాకుండా తెలుగులో కూడా సునీల్ సరసన హీరోయిన్గా చేసేందుకు ఓకే చెప్పిందట. ఇక తాజాగా మళయాళం ఇండస్ట్రీలో కూడా ఈ భామ అడుగుపెడుతున్నట్లు టాక్ వస్తోంది. మళయాళం స్టార్ హీరో మమ్ముట్టి హీరోగా నటిస్తున్న భీష్మ పర్వంలో ఆమె ఓ ముఖ్యమైన పాత్ర కోసం సెలెక్ట్ అయినట్లు సమాచారం. పాత్ర నచ్చడంతో అనసూయ కూడా ఎలాంటి అభ్యంతరం లేకుండా ఒప్పుకున్నట్లేనని టాక్ వస్తోంది.
previous post
next post