ఫ్లిప్కార్ట్ శనివారం నుంచి మరో సేల్కు తెర లేపనుంది. ‘ఫ్లిప్కార్ట్ ఫ్లిప్స్టార్ట్ డేస్’ పేరుతో జూన్ 1 నుంచి 3 వరకూ ఈ సేల్ కొనసాగనున్నట్లు సంస్థ ప్రకటించింది. ఈ మూడు రోజుల సేల్లో ముఖ్యంగా ఎలక్ట్రానిక్ వస్తువులపైనే రాయితీలు ఉంటాయని తెలిపింది. ఇందులో భాగంగా హెడ్సెట్లు, ల్యాప్ట్యాప్లు, పవర్ బ్యాంక్లు, మొబైల్ కేస్లు తదితర వస్తువులపై 80 శాతం వరకూ రాయితీ ఉంటుందని సంస్థ ప్రకటించింది. సోనీ, జేబీఎల్ వంటి హెడ్సెట్లు, స్పీకర్లపై 70 శాతం వరకూ డిస్కౌంటు లభించనుంది.
హెచ్పీ, ఏసర్ తదితర ల్యాప్టాప్ల ధర రూ.12,990 నుంచి మొదలుకానుంది. పవర్ బ్యాంకులు, మొబైల్ కేస్లు, ఇతర మొబైల్ ఉపకరణాల ప్రారంభ ధర కనీసం రూ.99 నుంచి ఉంటుందని ఆ ఫ్లిప్కార్ట్ తెలిపింది. అంతేకాక నో కాస్ట్ ఈఎంఐ, వారంటీ పొడిగింపు, ఎక్స్ఛేంజ్ సౌకర్యాలు కూడా కల్పిస్తున్నట్లు ఆ సంస్థ వెల్లడించింది. యాక్సిస్ బ్యాంకుతో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం ఆ కార్టులతో చెల్లింపులు జరిపేవారికి పది శాతం అప్పటికప్పుడే డిస్కౌంట్ ఇస్తున్నట్లు సంస్థ తెలిపింది.