ఖమ్మం జిల్లా దారుణం చోటుచేసుకుంది. తెల్దారుపల్లి గ్రామంలో టీఆర్ఎస్ నేత తమ్మినేని కృష్ణయ్యను దారుణం హత్యకు గురయ్యారు. మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అనుచరుడు తమ్మినేని కృష్ణయ్యను దుండగులు వేటకొడవళ్లతో నరికి చంపారు.
ఖమ్మం రూరల్ మండలం తెల్దారుపల్లిలో బైక్పై వెళ్తోన్న ఆయనను దుండగులు ఆటోతో ఢీకొట్టి అనంతరం వేటకొడవళ్లతో దాడి చేసి హత్య చేశారు. ఈ దాడిలో ఆరుగురు పాల్గొనున్నట్లు తెలుస్తోంది. తెల్దారుపల్లి శివారులోని రోడ్డుపై ఈ దాడి ఘటన జరిగింది.
తమ్మినేని కృష్ణయ్య ఆంధ్రా బ్యాంకు కర్షక సేవా సహకార సంఘం డైరెక్టర్గా ఉన్నారు.తమ్మినేని కృష్ణయ్య హత్యకు సీపీఎం నేత తమ్మినేని వీరభద్రం సోదరుడు కోటేశ్వరరావు కారణమని తెల్దారుపల్లికి చెందిన స్థానిక నేతలు ఆరోపిస్తున్నారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రానికి వరుసకు సోదరుడు అవుతాడు కృష్ణయ్య. గతంలో సీపీఎంలో పనిచేశారాయన. ఆ తర్వాత టీఆర్ఎస్లో చేరారు.
వీరభద్రం సొంత సోదరుడితో కృష్ణయ్యకు విభేదాలు ఉన్నాయని స్థానికులు అంటున్నారు. . ఈ క్రమంలో కృష్ణయ్య వర్గీయులు.. తమ్మినేని కోటేశ్వరరావు ఇంటిపై దాడి చేశారు. ఇంట్లో ఫర్నిచర్ను ధ్వంసం చేశారు.
పరిస్థితి ఆందోళనకరంగా మారడంతో తమ్మినేని కోటేశ్వరరావు ఇంటికి చేరుకున్నారు పోలీసులు..ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు ప్రారంభించినట్లు పోలీసులు తెలిపారు