గుంటూరు జిల్లాలోని వట్టిచెరుకూరు మండలంలో జరిగిన రోడ్డు ప్రమాదంపై హోం శాఖ మంత్రి సుచరిత స్పందించారు. ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందగా, పలువురు గాయపడ్డారు. తుఫాన్ వాహనం అదుపుతప్పి వాగులో పడిన ఘటనపై ఈ ఘటనపై సీఎం జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారని అన్నారు.
మృతులందరూ పేద కుటుంబాలకు చెందిన వారేనని, ఒక్కొక్కరికి రూ.2 లక్షల చొప్పున నష్టపరిహారం అందజేస్తామని ప్రకటించారు. వైఎస్ఆర్ బీమా పథకం కింద మరికొంత పరిహారం అందజేస్తామని అన్నారు. ఈ ఘటనలో గాయపడ్డ వారికి మెరుగైన వైద్యం అందించి అండగా ఉంటామని తెలిపారు.