పశ్చిమ బెంగాల్లోని నదియా జిల్లాలో శనివారం రాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 18 మంది దుర్మరణం చెందగా, మరో ఐదుగురు గాయపడ్డారు. ఉత్తర 24 పరగణాస్లోని బాగ్దా నుండి 20 మందికి పైగా వ్యక్తులు మృతదేహాన్ని దహన సంస్కారాలకు తీసుకుని వెళ్తుండగా నవద్వీప్ శ్మశానవాటిక వైపు వెళుతుండగా ఈ సంఘటన జరిగింది.
హన్స్ఖాలీ పోలీస్స్టేషన్ పరిధిలోని ఫుల్బరీలో రోడ్డు పక్కన ఆగి ఉన్న ట్రక్కును వ్యాన్ ఢీకొట్టిందని, ఈ ఘటనలో పలువురు మృతి చెందగా, మరికొందరు గాయపడ్డారని స్థానికులు తెలిపారు. దట్టమైన పొగమంచు, వాహనం అతివేగం కారణంగా ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. క్షతగాత్రులను ఆసుపత్రిలో చేర్పించారు. పోలీసుల విచారణ సాగుతోంది.