telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు సామాజిక

21 టెలి మెడిసిన్ సెంటర్లను ఏర్పాటు చేశాం: కేశినేని నాని

kesineni-nani

విజయవాడ పార్లమెంటు నియోజకవర్గ ప్రజలకు టెలి మెడిసిన్ సెంటర్లు అందుబాటులో ఉన్నాయని టీడీపీ ఎంపీ కేశినేని నాని తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల్లో క్లినిక్ కు రాలేని ప్రజలు ఈ ఫోన్ నంబర్లకు కాల్ చేసి ఉచితంగా వైద్య సంప్రదింపులు జరపవచ్చని ట్విట్టర్ ద్వారా పేర్కొన్నారు.

నియోజకవర్గ ప్రజల ఆరోగ్య భద్రత నిమిత్తం రతన్ టాటాగారితో కలిసి నేను ఏర్పాటు చేసినటువంటి 21 టెలి మెడిసిన్ సెంటర్లు ప్రజలందరికీ నిరంతరం అందుబాటులో ఉంటాయి. కావున ఎవరికి ఏ ఇబ్బంది వున్నా మీకు దగ్గరలో ఉన్న సెంటర్ కి ఫోన్ చేసిన యెడల మీకు ఉచిత వైద్య సదుపాయం లభిస్తుందని కేశినేని నాని తెలిపారు. ఈ అవకాశాన్ని అందరూ వినియోగించుకోవాలని కోరారు.

Related posts