telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

కొన్ని చానెళ్ల నిలిపివేత పై చంద్రబాబు ఫైర్

chandrababu

ఏపీలో కొన్ని వార్తా చానెళ్ల ప్రసారాలను నిలిపివేయడంపై టీడీపీ అధినేత చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే అంశంపై శుక్రవారం టీడీపీ సీనియర్ నేతలతో చంద్రబాబు సమావేశమయ్యారు. బాధితులకు సంబంధించిన వార్తలు ప్రసారం చేస్తున్న పలు చానళ్ల ప్రసారాలను నిలిపివేస్తున్నారంటూ ఆయన దృష్టికి రావడంతో ప్రభుత్వ వైఖరిపై మండిపడ్టారు.

అది కూడా కొన్ని చానళ్ల ప్రసారాలు నిలిపివేయాలంటూ మంత్రులే బెదిరించడమేంటని ఆయన విస్మయం వ్యక్తం చేశారు. తాము ఏ చానళ్లు చూడాలన్నది వినియోగదారుల ఇష్టం. ఫలానా చానల్ ను ఎంచుకునే స్వేచ్ఛను ట్రాయ్ కల్పించింది. అందుకు ఓ విధానం కూడా ఉంది. అసెంబ్లీలో విపక్షం గొంతు నొక్కేందుకు ప్రయత్నించారు, ఇప్పుడు వార్తా చానళ్ల గొంతు నొక్కేయాలని చూస్తున్నారా? టీవీ చానళ్ల ప్రసారాలను నిలిపివేయాలని మంత్రులే బెదిరించడం దారుణమన్నారు.

Related posts