సీజేఐగా బాధ్యతలు చేపట్టాక తొలిసారిగా గ్రామానికి వచ్చిన జస్టిస్ ఎన్వీ రమణకు గ్రామస్థులు ఘన స్వాగతం పలికారు. జస్టిస్ ఎన్వీ రమణ దంపతులను ఎడ్ల బండిపై గ్రామంలో ఊరేగించారు.
హైదరాబాద్ నుంచి వస్తున్న సీజేఐ.. రాష్ట్ర సరిహద్దు గరికపాడు చెక్పోస్టు వద్దకు చేరుకోగానే కృష్ణా జిల్లా యంత్రాంగం మేళతాళాలతో స్వాగతం పలికింది. మేళతాలాలు, జనసందోహం మధ్య ఊరేగింపు సాగింది. ఊరేగింపు తర్వాత ఆయన గ్రామంలోని శివాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. తర్వాత జస్టిస్ ఎన్వీ రమణ దంపతులకు గ్రామస్తులు పౌరసన్మానం చేశారు.
జిల్లా కలెక్టర్ నివాస్, పలువురు మహిళలు.. ఆయనకు ఆహ్వానం పలికి పుష్పగుచ్ఛాలు అందజేశారు. వేదపండితులు పూర్ణకుంభంతో, మేళతాళాల నడుమ స్వాగతం పలికారు. మహిళలు జాతీయజెండా చేతబూని.. ఎన్వీ రమణకు అభివాదం తెలిపారు.
ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను, హైకోర్టు రిజిస్ట్రారర్ జనరల్ ఏ.వి.రవీంద్రబాబు, రిజిస్ట్రార్ రిక్రూట్మెంట్ ఏ.గిరిధర్, లా సెక్రెటరీ సునీత, నందిగామ అడిషనల్ డిస్ట్రిక్ట్ జడ్జి బి.శ్రీనివాస్, డిఐజి రాజశేఖర్ బాబు, ఉమెన్ వెల్ఫేర్ కమిషనర్ కృతిక శుక్లా ఈ స్వాగత కార్యక్రమంలో పాల్గొన్నారు. స్వాగతం పలికిన వారిలో ఉన్నారు.
రాజ్యసభలో పిల్లి సుభాష్ చంద్రబోస్ కీలక వ్యాఖ్యలు…