ఏపీ పంచాయతీ ఎన్నికలలో మంత్రి కొడాలి నానికి సొంత ఊరిలోనే కి షాక్ ఇచ్చింది టీడీపీ. మంత్రి కొడాలి నాని సొంత ఊరిలో టిడిపి మద్దతు ఇచ్చిన అనూష అనే అభ్యర్థి దాదాపు 800 ఓట్ల మెజారిటీతో సర్పంచ్ గా గెలుపొందింది. పెదపారుపూడి మండలంలో ఉన్న ఎలమర్రు గ్రామంలో 12వ వార్డులకు గాను 11వ వార్డు టిడిపి అభ్యర్థులు కైవసం చేసుకోగా కేవలం ఒకే ఒక్క వార్డుకు వైసిపి పరిమితమైంది. ఒక రకంగా సొంత ఊరిలో ఇది కొడాలి నానికి షాక్ అనే చెప్పాలి. అయితే.. దీనిపై కొడాలి నాని స్పందించారు. “యలమర్రు గ్రామం మా పూర్వీకులు ఉండే వారు.. మా నాన్న, గుడివాడ లోనే పుట్టారు, నేను గుడివాడ లోనే పుట్టాను నా సొంత ఊరు గుడివాడ..యలమర్రు గ్రామంలో గ్రామంలో ఎవరినైనా ఓటు అడిగాను అని చెబితే ఈ రాజకీయాలు, రాష్ట్రం వదిలి పోతా” అని కొడాలి నాని స్పష్టం చేశారు.
previous post