తెలంగాణ మాజీ మంత్రి, ఆదిలాబాద్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే జోగు రామన్న మంత్రివర్గ విస్తరణ అనంతరం అజ్ఞాతంలోకి వెళ్లి కుటుంబ సభ్యులను ఆందోళనకు గురిచేసిన సంగతి తెలిసిందే. ఎట్టకేలకు బుధవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ బావోద్వేగానికి గురయ్యారు. తాను అనారోగ్య కారణంగానే అందుబాటులో లేనని చెప్పుకొచ్చారు. మంత్రి పదవి ఇస్తారనే ఆశ ఉండేనని, అది దక్కకపోవడంతో మనస్థాపానికి గురయ్యానన్నారు.
బీపీ పెరిగి ఆస్పత్రిలో చేరానే తప్ప అజ్ఞాతంలోకి వేళ్లే అవసరం తనకు లేదన్నారు. సర్పంచ్ స్థాయి నుంచి మచ్చలేని వ్యక్తిగా ఉన్న తనకు మంత్రి పదవి రాకపోవడం బాధ కలిగించిందంటూ మీడియా ముందు కంటతడి పెట్టారు. తనకు మంత్రి పదవి రాకున్నా టీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతానని, కేసీఆరే తమ నాయకుడు అని రామన్న స్పష్టం చేశారు.