telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

కేసీఆర్ ఫొటోలు ఇళ్లలో పెట్టుకుని పూజించుకోండి: లక్ష్మణ్

BJPpresident -K-Laxman

యాదాద్రి ఆలయ స్తంభాలపై సీఎం కేసీఆర్ బొమ్మలు, కారు గుర్తు చెక్కడంపై తెలంగాణ బీజేపీ చీఫ్ కె.లక్ష్మణ్ నిప్పులు చెరిగారు. కేసీఆర్ పై అంత భక్తి ఉంటే ఇళ్లలో ఆయన ఫొటోలు పెట్టుకుని పూజించుకోండి అంటూ అధికారులపై మండిపడ్డారు. ప్రజాధనంతో నిర్మించిన ఆలయాల్లో రాజకీయపరమైన చిత్రాలు ఉండడాన్ని సహించబోమని అన్నారు.

ఈ వ్యవహారంలో తప్పు ఎవరిదైనా సీఎం కేసీఆర్ బాధ్యత తీసుకోవాలని డిమాండ్ చేశారు. యాదాద్రి ఆలయంలో వ్యక్తుల చిత్రాలను ముద్రించడం అంటే దేవుడ్ని కించపర్చడమేనని అన్నారు. యజ్ఞయాగాదులు చేసినంత మాత్రాన ఉత్తములు కారని, పురాణాల్లో రాక్షసులు కూడా యజ్ఞాలు చేశారని వ్యాఖ్యానించారు. వారం రోజుల్లో ఆ చిత్రాలు తొలగించకపోతే హిందుత్వ సంస్థలు, బీజేపీ జోక్యం చేసుకోవాల్సి ఉంటుందని లక్ష్మణ్ హెచ్చరించారు.

Related posts