గుండెపోటుతో మరణించిన కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్అం త్యక్రియలు ముగిసాయి. ప్రభుత్వ అధికార లాంఛనాల మధ్య ఇవాళ ఉదయం అంత్యక్రియలు జరిగాయి. పునీత్కు మగపిల్లలు లేకపోవడంతో ఆయన సోదరుడు రాఘవేంద్ర కుమారుడు వినయ్తో అంత్యక్రియలు నిర్వహించారు. కుటుంబ సభ్యులు, అభిమానులు బరువెక్కిన గుండెలతో పునీత్ కడసారి వీడ్కోలు పలికారు.
కర్ణాటక సీఎం సహా అనేక మంది సినీ, రాజకీయ ప్రముఖులు అందరూ ఈ అంత్యక్రియల్లో పాల్గొన్నారు. ఆదివారం తెల్లవారుజామున కంఠీరవ స్టేడియం నుంచి ఆయన పార్థివ దేహాన్ని కంఠీరవ స్టూడియోస్ తీసుకెళ్లారు. ఉదయం 4.40 కే అంతిమ యాత్ర మొదలయింది. పునీత్ ను కడసారి చూసుకోవడానికి అభిమానులు బారులు దీరారు.
కంఠీరవ స్టూడియోలో అంత్యక్రియలు నిర్వహించారు. తల్లి పార్వతమ్మ, తండ్రి రాజ్ కుమార్ ల సమాధివద్దనే పునీత్ కు అంతిమ సంస్కారాలను నిర్వహించారు. పునీత్ రాజ్ కుమార్ అకాల మృతి దక్షిణాది సినీ పరిశ్రమనే కాదు అభిమానులను కూడా తీవ్ర శోక సంద్రంలో ముంచింది.