ఒకప్పుడు హీరోయిన్గా అలరించిన ఛార్మి కొన్నాళ్ళుగా పూరీ కనెక్ట్స్ నిర్మాణ సంస్థ బాధ్యతలని చూసుకుంటున్న విషయం తెలిసిందే. ప్రపంచాన్ని గడగడలాడిస్తోన్న ‘కరోనా వైరస్’ను నటి ఛార్మి స్వాగతించారు. అంతేకాదు ఆల్ ది బెస్ట్ చెప్పారు. తాజాగా హైదరాబాద్లో కరోనా వైరస్ సోకిన వ్యక్తిని వైద్యులు గుర్తించారు. దీంతో ఒక్కసారిగా తెలంగాణ వ్యాప్తంగా కలకలం రేగింది. మరోవైపు ‘కరోనా’ను నియంత్రించేందుకు వైద్యులు నానా కష్టాలు పడుతున్నారు. ప్రపంచ జనాభా అంతా భయంతో వణికిపోతున్నారు. ఈ నేపథ్యంలో ‘కరోనా’పై నటి ఛార్మి సోషల్ మీడియా టిక్ టాక్లో ఓ వీడియో పోస్ట్ చేశారు. ఈ వీడియో ఇప్పుడు వివాదాస్పదమైంది. ఛార్మి చేసిన వ్యాఖ్యలను నెటిజన్లు తప్పు బట్టారు. ఆమెకు వ్యతిరేకంగా కామెంట్లు పెట్టారు. ‘కరోనా’తో బెంబేలెత్తిపోతుంటే స్వాగతించడమేంటని ప్రశ్నించారు. దీంతో నటి ఛార్మి ఆ వీడియోను డిలీట్ చేశారు.
previous post