telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

కరోనాతో టాలీవుడ్ నటుడు మృతి

Venugopal

ప్రముఖ నటుడు కోసూరి వేణుగోపాల్‌ కరోనా బారిన పడి చికిత్స పొందుతూ మరణించారు. హైదరాబాద్‌ గచ్చిబౌలిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో 22 రోజులుగా చికిత్స పొందుతున్న ఆయన ఆరోగ్య పరిస్థితి క్షీణించింది. వెంటిలేటర్‌పై చికిత్స తీసుకుంటున్న వేణుగోపాల్ బుధవారం రాత్రి మరణించారు. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురానికి చెందిన వేణుగోపాల్‌ ఎఫ్‌సీఐలో మేనేజర్‌గా పనిచేసి రిటైర్ అయ్యారు. ఉద్యోగం చేస్తూనే సినిమాల్లో నటించేవారు. మర్యాద రామన్న, విక్రమార్కుడు, ఛలో, పిల్ల జమిందారు వంటి అనేక సినిమాల్లో నటించి మంచి గుర్తింపు పొందారు. వేణుగోపాల్ మృతి పట్ల టాలీవుడ్ దిగ్భ్రాంతికి లోనైంది. పలువురు నటులు ఆయన మృతికి సంతాపం తెలిపారు.

Related posts