telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

ప్రభుత్వ నియంతృత్వ ధోరణికి బుద్ధి చెప్పాలి: కన్నా

Kanna laxminarayana

ఏపీ ప్రభుత్వ నియంతృత్వ ధోరణికి తగిన బుద్ధి చెప్పాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. విజయవాడలో బీజేపీ–జనసేన ఉమ్మడి మీడియా సమావేశం నిర్వహించింది. ఈ సందర్భంగా విజన్ డాక్యుమెంట్ ను కన్నా, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ లు ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా కన్నా మాట్లాడుతూ, స్థానిక సంస్థల ఎన్నికల్లో తమ అభ్యర్థులను ఆదరించి గెలిపించాలని ప్రజలను కోరారు. ప్రతిపక్ష అభ్యర్థులు నామినేషన్లు వేయకుండా అడ్డుకోవడంపై పోలీసులకు, రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసినా ఫలితం ఉండటం లేదని విమర్శించారు.

Related posts