టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి టీఆర్ఎస్ నాయకుల పైన ఫైర్ అయ్యారు. నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ లోని కాకతీయ భవన్ కమ్మ సేవసమితి భవనంలో ఏర్పాటు చేసిన కాంగ్రెస్ ముఖ్య కార్యకర్తల సమావేశానికి జానారెడ్డి, టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. నాగార్జున సాగర్ నియోజకవర్గంలో ఏడేళ్లలో టీఆరెస్ చేసిన అభివృద్ధి ఏంటి? అని ప్రశ్నించారు. నాగర్జున సాగర్ ప్రాజెక్టు కట్టించింది కాంగ్రెస్ పార్టీ అని… చరిత్ర తెలియని అధికార టీఆర్ఎస్ పార్టీ నేతలు అబద్దాలు ప్రచారం చేస్తున్నారని నిప్పులు చెరిగారు. టీఆర్ఎస్, బీజేపీ రెండూ మోసకారి పార్టీలేనని మండిపడ్డారు. జనారెడ్డిని గెలిపిస్తే ఎంపీ, ఎమ్మెల్యేలుగా మేం నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటామని హామీ ఇచ్చారు. నాగార్జున సాగర్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు ఉత్తమ్. అయితే ఈ ఎన్నికలను అన్ని పార్టీలు చాలా సీరియస్ గా తీసుకున్నాయి. చూడాలి మరి ఇక్కడ ప్రజలు ఏ విధమైన తీర్పు ఇస్తారు అనేది.
previous post