telugu navyamedia
క్రైమ్ వార్తలు

జూబ్లీహీల్స్ రేప్ కేసులో ఆరుగురు అరెస్ట్‌..ఒక‌రు మేజ‌ర్‌…ఐదుగురు మైన‌ర్లు

*జూబ్లీహీల్స్ రేప్ కేసులో ఆరుగురు అరెస్ట్‌..
*ఆరుగురులో ఒక‌రు మేజ‌ర్‌…ఐదుగురు మైన‌ర్లు
*బాధితురాలుని చూసి ప్లాన్ వేసుకున్న నిందితులు..
*ఉస్మాన్ ఆలీఖాన్ ద్వారా ప‌బ్ బుకింగ్‌..
*​ రేప్​ కేసులో నిందితులకు 20 సంవ‌త్స‌రాలు జైలు లేదాజీవిత ఖైదు శిక్ష పడే అవకాశం..

హైద‌రాబాద్ జూబ్లీహీల్స్ అమ్నీషియా పబ్ బాలిక రేప్ కేసులో మొత్తం ఆరుగురుని అరెస్ట్ చేసిన‌ట్లు సీపీసీవీ ఆనంద్ వెల్ల‌డించారు. ఈ ఆరుగురులో ఒక‌రు మేజ‌ర్‌..ఐదుగురు మైన‌ర్లు ఉన్న‌ట్లు తెలిపారు. 

మంగళవారం సాయంత్రం ప్రెస్‌ మీట్‌ నిర్వహించిన నగర కమిషనర్‌.. ఈ కేసులో నిందితులు మైనర్లు కాబట్టి పేర్లు, ఇతర వివరాలు వెల్లడించడం కుదరని స్పష్టం చేశారు.వీరిలో ఒకరు పద్దెనిమిదేళ్లకు ఒక్క నెల తక్కువగా ఉన్నారు. 

మార్చి 28న ఈ వ్యవహారం మొదలైంది. బెంగళూరులో ఉండే ఒక స్టూడెంట్‌.. స్కూల్‌ మొదలుకాక ముందు పార్టీ చేసుకోవాలని హైదరాబాద్‌లో స్నేహితులతో ప్లాన్‌ చేశాడు. అందుకోసం అమ్నీషియా పబ్‌ను ఎంచుకుని.. ఏప్రిల్‌లో పార్టీ గురించి పోస్ట్‌ చేశాడు.

నాన్‌ ఆల్కహాలిక్‌, నాన్‌ స్మోకింగ్‌తో పార్టీ కోసం పబ్‌లో బుక్ చేసుకున్నారు. ఉస్మాన్‌ అలీఖాన్‌ అనే వ్యక్తి ద్వారా పబ్‌ను బుక్‌ చేయించారు. మే 28వ తేదీన పార్టీ గురించి సదరు స్టూడెంట్‌ మళ్లీ పోస్ట్‌ చేశాడు. మే 28వ తేదీన మధ్యాహ్నాం టికెట్‌ ధర చెల్లించి స్నేహితుడితో క‌లిసి బాధితురాలు పబ్‌కు వెళ్లింది.

పబ్‌లో బాలికపట్ల ఇద్దరు అసభ్యంగా ప్రవర్తించారు. పబ్‌ నుంచి బాలిక, ఆమె స్నేహితురాలు బయటకు వచ్చారు నిందితులు.. పబ్‌లో ముందుగానే పథకం వేసుకుని ఆమె ఫాలో చేసి ట్రాప్‌ చేశారు. అదే రోజు సాయంత్రం రోడ్డు నెంబర్‌ 44లో పెద్ద‌మ్మ‌త‌ల్లి గుడి వెనుక నిర్మానుష్య ప్రదేశంలో బాలికపై ఒకరి తర్వాత ఒకరు ఐదుగురు అత్యాచారం చేశారు.

రాత్రి 7.31 గం.కు మళ్లీ పబ్‌ దగ్గర బాధితురాలిని వదిలిపెట్టారు.ఆ త‌రువాత బాదితురాలు తండ్రికి ఫోన్‌ చేస్తే రాత్రి 7.53 గం.కు తండ్రి వచ్చి తీసుకెళ్లాడు. మే 28న ఘటన జరిగినా మే 31 వరకు బాలిక తల్లిదండ్రులకు చెప్పలేదు. మెడపై గాయాలను చూసి తల్లిదండ్రులకు అనుమానం వచ్చి పోలీసులను ఆశ్రయించారు.

మే 31న పోక్సో యాక్ట్‌ ప్రకారం.. జూబ్లీహిల్స్‌ పీఎస్‌లో కేసు నమోదు చేశారు. భరోసా కేంద్రంలో బాధితురాలికి ధైర్యం చెప్పడంతో వివరాలు చెప్పింది . ఆ తర్వాత మరికొన్ని సెక్షన్లు నమోదు చేశామ‌ని అన్నారు. ఆ త‌రువాత నీలోఫర్‌ ఆస్పత్రిలో బాధితురాలిని చేర్పించి చికిత్స అందించామ‌ని వెల్ల‌డించారు.

పబ్‌, బేకరి వద్ద అన్ని సీసీ ఫుటేజీలను పరిశీలించాం. ఏ1 సాదుద్దీన్‌తో పాటు మైనర్‌ నిందితులు, బాధితురాలు వాహనంలో వెళ్లారు. మైనర్‌తో పాటు సాదుద్దీన్‌ బాధితురాలి పట్ల అసభ్యంగా ప్రవర్తించారు. నిందితులను బాధితురాలు గుర్తించలేకపోయింది. ఆధారాలతో సహా జూన్‌ 2వ తేదీన నిందితులను గుర్తించాం. జూన్‌ 3న సాదుద్దీన్‌ను అరెస్ట్‌ చేశాం. ఏ1 సాదుద్దీన్‌తో పాటు మిగతా వాళ్లపై కేసు నమోదు అయ్యింది. సాదుద్దీన్‌తో పాటు నలుగురిని అరెస్ట్‌చేశాం. మరొకరి కోసం స్పెషల్‌ టీమ్‌ ఏర్పాటు చేశాం. దర్యాప్తు చాలా పారదర్శకంగానే జరిగిందని.. పలు కోణాల్లో దర్యాప్తు చేయడం వల్లే ఆలస్యమైందని చెప్పారు.

ఇలాంటి కేసుల్లో  నిందితులకు 20 సంవ‌త్స‌రాలు జైలు లేదా జీవిత ఖైదు శిక్ష పడే అవకాశం ఉంద‌ని సీపీ సీవీ ఆనంద్‌ వెల్లడించారు. అందరిపై గ్యాంగ్ రేప్, పోక్సో కేసులు నమోదు చేసినట్లుగా తెలిపారు. 

మైనర్లకు పబ్‌లోకి ఎంట్రీ అవకాశం కల్పించిన అమ్నేసియా పబ్‌పై కఠిన చర్యలు ఉంటాయని సీపీ ప్రకటించారు.నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటారని.. మైనర్లకు అనుమతిపై కఠినంగా వ్యవహరిస్తామని స్పష్టం చేశారు.

Related posts