telugu navyamedia
క్రైమ్ వార్తలు తెలంగాణ వార్తలు వార్తలు

సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ కుటుంబం ఆత్మహత్య

New couples attack SR Nagar

హైదరాబాద్‌నగరంలో ని హస్తినాపురంలో విషాదం చోటుచేసుకుంది. సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ కుటుంబం ఆత్మహత్య చేసుకుంది. నలుగురు ఒకేసారి పురుగుల మందు తాగి, ఆత్మహత్యకు పాల్పడ్డారు. వివరాల్లోకి వెళితే ఇబ్రహీంపట్నానికి చెందిన ప్రదీప్‌, స్వాతి దంపతులు.. హైదరాబాద్‌లోని హస్తినాపురంలో నివాసముంటున్నారు. ప్రదీప్‌ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిగా విధులు నిర్వహిస్తున్నాడు. వారికి ఇద్దరు కుమారులు.. కళ్యాణ్‌(6), జయకృష్ణ(2) ఉన్నారు.

కాగా, కొన్ని నెలలుగా ప్రదీప్‌ కుటుంబం ఆర్థిక సమస్యలతో సతమతమవుతోంది. ఆ ఒత్తిడి తట్టుకోలేని ప్రదీప్‌ దంపతులు ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు బంధువులు తెలిపారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Related posts