telugu navyamedia
ఆంధ్ర వార్తలు క్రైమ్ వార్తలు వార్తలు

కర్నూలు టోల్ ప్లాజా వద్ద రూ.1 కోటి 80 వేలు పట్టివేత

hard cash

తమిళనాడులోని తిరువళ్లూరు వద్ద ఒంగోలుకు చెందిన ఓ కారులో రూ.5.27 కోట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా అలాంటిదే మరో ఘటన ఏపీలో జరిగింది. కర్నూలు జిల్లా పాణ్యం మండలం చాపిరేవుల టోల్ ప్లాజా వద్ద ఓ కారులో రూ.1 కోటి 80 వేలు స్వాధీనం చేసుకున్నారు.

కారు హైదరాబాద్ నుంచి తమిళనాడులోని కోయంబత్తూరు వెళుతున్నట్టు గుర్తించారు. ఈ డబ్బుకు సంబంధించిన పత్రాలు లేకపోవడంతో పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కారును సీజ్ చేసిన పోలీసులు అనంతరం కేసు నమోదు చేశారు.

Related posts