యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఖరీదైన లగ్జరీ కారు కొనుగోలు చేసి దేశంలోనే తొలి వ్యక్తిగా నిలిచాడు. మోడల్ కార్లు మీద మక్కువతో అంత్యంత ఖరీదైన లంబోర్ఘిని ఉరుస్ కారును సొంతం చేసుకున్నాడు. దీని విలువ దాదాపు ఏడు కోట్ల వరకు ఉంటుందట. మార్కెట్ లో ఏదైనా లగ్జరీ కారు వచ్చిందంటే అది తన గ్యారేజ్ లో ఉండాల్సిందేనంట. తారక్ కార్లు మీద పిచ్చితో ఇండియాలో లాంచ్ అయిన తొలి రోజే ఈ కారును ఎన్టీఆర్ బుక్ చేసుకున్నాడు.
లగ్జరీ ఫీచర్స్ తో ఉన్న అనేక కాస్ట్లీ కార్లను బైక్స్ ను తారక్ ఇష్టంగా తెప్పించుకున్నారు. ఈ క్రమంలో ఇటాలియన్ లగ్జరీ కారుగా పేరొందిన లంబోర్ఘిని ఉరుస్ గ్రాఫిటే క్యాప్సుల్ కారుని ఎన్టీఆర్ ఇంపోర్ట్ చేసుకున్నారు. ఈ కారు ఫుల్ ఆటోమేటేడ్ అట. అంతేకాదు ఇందులో ఆటో సెన్సర్ మిషన్స్ కూడా ఉండటంతో ఎదురుగా వాహనాలు ఉంటే అలర్ట్ చేస్తుందట. ఆటోమేటేడ్ కారు తాళాలు ఈ కారు ప్రత్యేకత. ఎలాంటి ప్రమాదం జరిగిన కారు అద్దాలు, కానీ డోర్లు కానీ అంత ఈజీ తెరచుకోవట. ఫుల్లీ ఆటోమెటెడ్, సెఫ్టీతో లంబోర్ఘినిని తయారు చేశారు. దీంతో ఎన్టీఆర్ లంబోర్ఘీన ఊరుస్ ఇప్పుడు టాలీవుడ్లో హాట్ టాపిక్గా మారింది.
అయితే ఇండియాలో ఈ మోడల్ కారు కొన్న మొదటి హీరో ఎన్టీఆరే అని, ఇది అత్యంత ఖరీదైనదిగా కూడా చెప్తున్నారు. దీనికి సంబందించిన ఫోటోలు ఇప్పడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. హైదరాబాద్ లోని ఓ ఇంపోర్ట్ కంపెనీ ద్వారా బుక్ చేసుకున్న లంబోర్ఘిని ఉరుస్ కారు ఎన్టీఆర్ ఇచ్చిన స్టిల్ ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతుంది.
ఈ ఫొటోలో సీనియర్ సినీ నటుడు శ్రీకాంత్, మరో స్నేహితుడితో ఎన్టీఆర్ కలిసి ఫోటో దిగారు. ప్రస్తుతం కారుతో పాటు ఎన్టీఆర్ దిగిన ఫొటోలో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఒకప్పుడు హార్లీ డేవిడ్సన్ బైక్ కొన్న ఫస్ట్ హీరోగా నిలిచిన తారక్ మళ్ళీ ఇప్పుడు లగ్జరీ కారు విషయంలోనూ తారక్ ఫస్ట్ అంటూ ఫ్యాన్స్ తెగ సంబర పడుతున్నారు.