దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ ప్రధాన పాత్రలలో “ఆర్ఆర్ఆర్” అనే భారీ బడ్జెట్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఈ చిత్రంలో చరణ్ సరసన కథానాయికగా అలియా భట్, ఎన్టీఆర్కి జోడీగా ఓలివియా మోరిస్పై సనటిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ చిత్రం విడుదల ఆలస్యం కావొచ్చు అంటూ వార్తలు వినిపించిన విషయం తెలిసిందే. తాజాగా “ఆర్ఆర్ఆర్” ఈ చిత్రాన్ని 2021, జనవరి 8న విడుదల చేస్తున్నట్లు చిత్రయూనిట్ అధికారికంగా ప్రకటించింది. స్వాతంత్ర్య నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమా నైజాం రైట్స్ భారీ ధరకు అమ్ముడయ్యాయనే వార్త ఫిలింనగర్లో, సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. “ఆర్ఆర్ఆర్” మూవీని పాన్ ఇండియా లెవల్లో పది భాషల్లో విడుదల చేయనున్నారు. దీనికి చాలా సమయం పడుతుందని తప్పని పరిస్థితుల్లో వాయిదా వేస్తున్నామని తెలిపారు. అయితే ఇప్పుడు “ఆర్ఆర్ఆర్” నైజాం థియేట్రికల్ రైట్స్ ప్రముఖ నిర్మాత, పంపిణీ దారుడు దిల్ రాజు ఫ్యాన్సీ రేటుకి దక్కించుకున్నారు. కరెక్ట్ ఫిగర్ బయటకు రాలేదు కానీ దాదాపు రూ.100 కోట్ల రూపాయలు ఆఫర్ చేశారని తెలుస్తోంది. ఈ సంక్రాంతికి వచ్చిన ‘సరిలేరు నీకెవ్వరు’, ‘అల వైకుంఠపురములో’ సిినిమాలు ఎంత బిజినెస్ చేశాయో అంతకుమించి ఆర్ఆర్ఆర్ బిజినెస్ జరుగుతుందని ట్రేడ్ వర్గాల అంటున్నాయి.
previous post