నందిత శ్వేతా, మాన్యం కృష్ణ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘జెట్టి’. వర్ధిన్ ప్రొడక్షన్స్ పతాకంపై సుబ్రమణ్యం పిచ్చుక దర్శకుడు. కె.వేణు మాధవ్ నిర్మిస్తున్నారు. మత్స్యకార నేపథ్య కథతో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ సినిమా త్వరలో తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కానుంది. ఈ నేపథ్యంలోనే నందమూరి హీరో బాలకృష్ణ ట్రైలర్ విడుదల చేసి, చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు.
ఇక “జెట్టి” ట్రైలర్ విషయానికొస్తే.. ‘నా ఆశకంటే మా నాన్న ఆశయం గొప్పది సర్’ అని హీరోయిన్ చెప్పిన డైలాగ్తో ఈ ట్రైలర్ ప్రారంభమైంది. ఊరికి జెట్టిని తీసుకురావాలనే తండ్రి ఆశయాన్ని సాధించేందుకు కూతురుగా రాజీలేని పోరాటం చేస్తుంది.
‘జెట్టి’ కోసం రెండు వర్గాల మధ్య సాగే సన్నివేశాలతో ఆద్యంతం ఆసక్తిగా సాగింది. ‘మేం వెనకబడే ఉన్నాం. కానీ, వెన్నుపూస కూడా వెనకే ఉంటుంది సర్. ఎందుకో తెలుసా? మనిషిని నిలబెట్టడానికి, ముందుకు నడిపించడానికి’ అని కథానాయిక తండ్రి చెప్పిన ఈ సంభాషణ అందరినీ మెప్పించేలా ఉంది. మీరు ఖచ్చితంగా జెట్టి సాధింస్తారు నాన్న కూతురు తండ్రికి ధైర్యం చెబుతుంది
మరి నందిత అనుకున్నట్టుగా తన తండ్రి ఆశయం నెరవేరుతుందా? అసలు ‘జెట్టి’ కథేంటి? తెలియాలంటే సినిమా చూడాల్సిందే. సినిమా “ఓ మత్స్యకార గ్రామంలో జరిగిన ఘటనలను ఆధారంగా తీసుకొని ..మత్స్యకార జీవనం, స్థితిగతులు, వారి జీవనంలోని భావోద్వేగాలను సహజంగా చూపించినట్లు ట్రైలర్ ద్వారా తెలుస్తోంది.
మత్స్యకారుల జీవన విధానాలను, వారి కట్టుబాట్లను దర్శకుడు ఎంతో చక్కగా చిత్రీకరించారు. ప్రస్తుతం నిర్మాణాంతర పనులు జరుగుతున్నాయి. త్వరలో విడుదలకు సిద్ధంగా ఉంది.