టాలీవుడ్ యంగ్ హీరో నాగశౌర్య, ‘పెళ్లి చూపులు’ఫేమ్ రీతూ వర్మ జంటగా నటించిన తాజా చిత్రం ‘వరుడు కావలెను’. రొమాంటిక్ అండ్ కామెడీ ఎంటర్టైనర్ “వరుడు కావలెను” .లక్ష్మీ సౌజన్యను దర్శకురాలిగా పరిచయం చేస్తూ సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై పీడీవీ ప్రసాద్ సమర్పణలో సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన పోస్టర్, టీజర్తో పాటు పాటలకి మంచి రెస్పాన్స్ వచ్చింది. అలాగే ఈ సినిమా నుంచి విడుదలైన ‘దిగు దిగు దిగు నాగ’ సాంగ్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ మూవీ ట్రైలర్ని దగ్గుబాటి రానా విడుదల చేస్తూ.. చిత్ర యూనిట్కు అభినందనలు తెలిపాడు. సినిమా తప్పకుండా విజయం సాదిస్తుందని ట్రైలర్ చూస్తే అర్ధమవుతుందని రానా అన్నారు.
ఇక ట్రైలర్ విషయానికొస్తే.. ‘పెళ్లి చూపుల కాన్సెప్టే మా అమ్మాయికి పడదు’ అని హీరోయిన్ తల్లి చెప్పిన డైలాగ్తో ట్రైలర్ ప్రారంభం అవుతుంది. పెళ్లి చూపులు కాన్సెప్ట్ అంటేనే ఇష్టంలేని భూమి అనే అమ్మాయిని ప్రేమిస్తాడు ఆకాశ్. ఆమెను ఇంప్రెస్ చేయడానికి ప్రయత్నం చేస్తుంటాడు. ఆయన ప్రయత్నం ఫలించి.. భూమి ప్రేమను పొందుతాడు.
కట్ చేస్తే.. ఇద్దరి మధ్య మనస్పర్థలు వచ్చి విడిపోతారు. ‘భూమి, ఆకాశం.. ఎదురెదురుగా ఉన్నా ఎప్పటికీ కలవలేవు’ అంటూ శౌర్యని దూరంపెడుతుంది రీతూ. మరి ఆ విభేధాలకు గల కారణాలు ఏంటో తెలియాలి. ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. అక్టోబరు 29న ప్రేక్షకుల ముందుకు రానుంది.
హీరోయిన్ వయసుపై టీవీ నటుడి కామెంట్స్… ఆమె స్పందన ఇదీ