telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

వరుస ప్రమాదాలు ఎందుకు జరుగుతున్నాయి?: పవన్

pawan

విశాఖ ఫార్మాసిటీలో సోమవారం రాత్రి భారీ అగ్ని ప్రమాదం సంభవించింది.   పరిశ్రమలో రియాక్టర్ పేలడంతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఇవి రసాయన డ్రమ్ములకు అంటుకోవడంతో భారీ శబ్దంతో పేలిపోయాయి. రాత్రి 11 గంటల ప్రాంతంలో జరిగిన ఈ భారీ పేలుడుతో విశాఖ నగరం ఉలిక్కిపడింది. ఈ ఘటనపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పందించారు.

విశాఖ జిల్లా గాజువాక, పరవాడ పారిశ్రామిక ప్రాంతాల్లో వరుసగా ప్రమాదాలు సంభవించడం ఆందోళన కలిగిస్తోందన్నారు. ఎల్జీ పాలిమర్స్, సాయినార్ ఫార్మా ప్రమాదాలు మరవక ముందే రాంకీ ఫార్మా సిటీలోని విశాఖ సాల్వెంట్ కర్మాగారంలో సంభవించిన ప్రమాదం భయబ్రాంతులకు గురి చేసిందన్నారు. వరుస ప్రమాదాలు ఎందుకు జరుగుతున్నాయని ఈ సందర్భంగా ఆయా కంపెనీల యజమాన్యాలను పవన్ ప్రశ్నించారు.

Related posts