ప్రముఖ సామాజిక వేత్త అన్నా హజారే లోక్పాల్, లోకాయుక్తలను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేయడంతో పాటు రైతుల సమస్యలను పరిష్కరించాలని దీక్షకు దిగడం తెలిసిందే. ఆయన దీక్ష ఐదవ రోజుకు చేరింది. హజారే బిపి, షుగర్ లెవల్స్ లో తేడా నమోదవుతోందని వైద్యులు తెలిపారు. ప్రధానమంత్రి ఇచ్చిన హామీని నిలబెట్టుకోకపోతే.. తనకిచ్చిన పద్మభూషణ్ అవార్డును తిరిగి ఇచ్చేస్తానని సామాజికవేత్త అన్నా హజారే ప్రకటించారు.
అహ్మద్నగర్ జిల్లాలో రాలెగావ్ సిద్ధి గ్రామ అభివృద్ధికి చేసిన తోడ్పాటుకుగాను హజారే ప్రత్యేక గుర్తింపు పొందారు. ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దటానికి హజారే చేసిన ప్రయత్నాలకు గుర్తింపుగా భారత ప్రభుత్వం 1992 లో అన్నా హజారేకు పద్మ భూషణ్ అవార్డు ఇచ్చింది.
కేసీఆర్ గోడ మీద పిల్లి.. చంద్రబాబు అవకాశవాది: దత్తాత్రేయ