telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

నేడు వైఎస్సార్ జయంతి.. నివాళులు అర్పించిన మమతా

BJP compliant EC West Bengal

ఆంధ్రప్రదేశ్ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతిని ఈరోజు ఏపీ ప్రభుత్వం రైతు దినోత్సవంగా నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ వైఎస్ రాజశేఖరరెడ్డికి నివాళులు అర్పించారు. ‘ఏపీ మాజీ సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డికి ఆయన జయంతి సందర్భంగా నివాళులు అర్పిస్తున్నా’ అని మమతా బెనర్జీ ట్వీట్ చేశారు.

ఈ ట్వీట్ కు ఏపీ సీఎం వైఎస్ జగన్ ను ట్యాగ్ చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో 2009, సెప్టెంబర్ 2న రచ్చబండ కార్యక్రమానికి వెళుతుండగా కర్నూలు జిల్లా పావురాల గుట్ట వద్ద హెలికాప్టర్ కూలిపోవడంతో ఆయన మృతి చెందిన విషయం విధితమే.

Related posts