దేశవ్యాప్తంగా ఉల్లి ధరలు చుక్కలనంటుతున్న తరుణంలో తన వ్యాపారాన్ని పెంచుకునేందుకు మహారాష్ట్రకు చెందిన ఓ దుస్తుల దుకాణం యజమాని బంపరాఫర్ ను ప్రకటించాడు. తన వద్ద రూ. 1000కి దుస్తులు కొనుగోలు చేస్తే, కిలో ఉల్లిపాయలను ఉచితంగా ఇస్తానని ప్రకటించాడు.
ఉల్లాస్ నగర్ లోని శీతల్ హ్యాండ్ లూమ్స్ యజమాని ఈ ఆఫర్ ను పెట్టాడు. “ఉల్లిపాయల ధర కిలోకు రూ. 130కి చేరుకుంది. ఈ రోజు కూడా ధర పెరిగింది. దీంతో రూ. 1000కి దుస్తులు కొనుగోలు చేస్తే, ఉల్లిపాయలను ఉచితంగా ఇవ్వాలని నిర్ణయించాం. ఎంతో మంది ఈ ఆఫర్ ను ఇష్టపడుతున్నారు” అని షాపు యజమాని పేర్కొన్నారు.
కశ్మీర్ ప్రజల సంబంధాలను భారత్ తెంచివేసింది: పాకిస్తాన్