telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

పవన్ నామినేషన్ దాఖలుకు ముహూర్తం ఖరారు!

సార్వత్రిక ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ఏపీలో నామినేషన్ల ప్రక్రియ ఊపందుకొంది. ఈ క్రమలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నామినేషన్ దాఖలు చేసేందుకు ముహూర్తం ఖరారు చేసుకున్నారు. రెండు చోట్ల పోటీ చెయ్యాలని నిర్ణయించుకున్న పవన్ కళ్యాణ్ పశ్చిమగోదావరి జిల్లా భీమవరం నియోజకవర్గం నుంచి, విశాఖపట్నం జిల్లా గాజువాక నుంచి బరిలో దిగనున్నట్టు ప్రకటించారు.

ఈనెల 21న విశాఖపట్నం జిల్లా గాజువాక నియోజకవర్గానికి ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం 1గంట మధ్య నామినేషన్ దాఖలు చెయ్యనున్నట్లు పార్టీ జనసేన ప్రకటన విడుదల చేసింది. ఆ మరుసటి రోజు 22న మధ్యాహ్నం 1గంట నుంచి సాయంత్రం 5గంటలలోపు పశ్చిమగోదావరి జిల్లా భీమవరం నియోజకవర్గం నుంచి పవన్ కళ్యాణ్ నామినేషన్ వేయనున్నారు.

Related posts