రాయలసీమలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ పర్యటన ఖరాయింది. ఆయన పర్యటన వివరాలను తెలియజేస్తూ పవన్రాజకీయ కార్యదర్శి పి.హరిప్రసాద్ ఓ ప్రకటన విడుదల చేశారు. డిసెంబరు 1వ తేదీ నుంచి ఆరు రోజుల పాటు రాయలసీమ జిల్లాల్లో పవన్ పర్యటన ఉంటుదని తెలిపారు. ఇందులో భాగంగా రాయలసీమ సమస్యలపై రైతాంగం, మేధావులతో పలు చర్చలు చేపడతారని అన్నారు.
డిసెంబరు 1వ తేదీ నుంచి 6 వ తేదీ వరకు పవన్ రాయలసీమలో పర్యటిస్తారు. జిల్లా రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలపై రైతులతో చర్చిస్తారు. చిత్తూరు పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలో పోటీ చేసిన అభ్యర్థులు, జనసేన నాయకులతో సమీక్షా సమావేశం నిర్వహిస్తారు. రాయలసీమ జిల్లాల్లో జనసేన నాయకులు, శ్రేణులపై అక్రమ కేసులు బనాయించడంతో ఇబ్బంది పడుతున్న వారికి పవన్ భరోసా కల్పించనున్నారు.