telugu navyamedia
రాజకీయ వార్తలు

వేడెక్కిన రాజస్థాన్ రాజకీయం..సీఎం గెహ్లాట్ సంచలన వ్యాఖ్యలు

Ashok gehalot rajasthan

రాజస్థాన్ లో వచ్చే నెల 14 నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో రాజస్థాన్ రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. ఆరోజున అశోక్ గెహ్లాట్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో కానసాగుతుందా? లేక కూలిపోతుందా? అనే విషయం తేలనుంది.

ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలను జైపూర్ నుంచి జైసల్మేర్ కు తరలిస్తున్నారు. ఈ సందర్భంగా గెహ్లాట్ మాట్లాడుతూ ఆరుగురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో విలీనం కావడాన్ని తప్పుపడుతున్నారని విమర్శించారు. తెలుగుదేశం పార్టీకి చెందిన నలుగురు రాజ్యసభ సభ్యులు రాత్రికి రాత్రి బీజేపీలో విలీనమయ్యారని గుర్తు చేశారు. ఈ విలీనాన్ని మాత్రం సరైందని బీజేపీ వాదిస్తుందని విమర్శించారు. మరి టీడీపీ ఎంపీలు విలీనమైనప్పుడు బీజేపీ వాదన ఏమైందని అసహనం వ్యక్తం చేశారు.

Related posts