telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

ఏపీలో వైసీపీ గెలిస్తే కేసీఆర్ గెలిచినట్టే: పవన్ కల్యాణ్

ఏపీలో వైసీపీ గెలిస్తే తెలంగాణ సీఎం కేసీఆర్ గెలిచినట్టేనని జనసేన పార్టీ వ్యవస్థాపకుడు పవన్ కల్యాణ్ అన్నారు. కృష్ణా జిల్లా నూజివీడులో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆయన మాట్లాడుతూ చంద్రబాబుకు రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలంటే కేసీఆర్ ఏపీకి వచ్చి పోటీ చేయాలని అన్నారు. ఏపీలో వైసీపీ గెలిస్తే ఆంధ్రుల ఆత్మగౌరవం దెబ్బతిన్నట్టేనని పవన్ వ్యాఖ్యానించారు. ప్రతిపక్ష నేతగా ఏం సాధించ లేని జగన్, ఇక, ముఖ్యమంత్రి అయితే ఏం చేస్తారని ప్రశ్నించారు. స్పెయిన్ లో టమాట పండగలా, నూజివీడు అంటే మామిడి పళ్ల పండగ గుర్తుకురావాలని అన్నారు.

రాజకీయాల్లో నాకు రూపాయి అవసరం లేదని చెప్పారు. జగన్‌లా కేసీఆర్‌ కనుసన్నల్లో పని చేసే వ్యక్తిని కాదని పేర్కొన్నారు. ఏపీలో వైసీపీని గెలిపిస్తే టీఆర్ఎస్‌ను గెలిపించినట్లే. చంద్రన్న, జగనన్న పేర్లతో పథకాలు ఎందుకని ప్రశ్నించారు. ఈ ఎన్నికల్లో జనసేన పార్టీ విజయం సాధించి అధికారంలోకొస్తే ప్రభుత్వ పథకాలకు పొట్టి శ్రీరాములు, అంబేద్కర్‌ పేర్లు పెడతానని పేర్కొన్నారు. 25 కిలోల బియ్యం, రూ. 2500 ఇవ్వడానికి రాజకీయాల్లోకి రాలేదు. మీ 25 సంవత్సరాల భవిష్యత్తు మీ పిల్లల భవిష్యత్తు ఇవ్వడానికి రాజకీయాల్లో వచ్చానని పవన్ అన్నారు.

Related posts