కరోనాను భారత ప్రభుత్వం ఆయుష్మాన్ భారత్ లో చేర్చిందని తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. ఈ నేపథ్యంలో ఆ కార్యక్రమాన్ని తెలంగాణలో కూడా అమలు చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఆయన విన్నవించారు. కరోనా మహమ్మారిని ఎదుర్కోవడంలో ప్రభుత్వానికి పూర్తిగా సహకరిస్తామని కేసీఆర్ కు ఆయన లేఖ రాశారు.
ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాల్లో భాగస్వాములయ్యేందుకు లక్షలాది మంది బీజేపీ కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారని లేఖలో పేర్కొన్నారు.. నిత్యావసర వస్తువుల ధరలను పెంచకుండా దళారులపై చర్యలను చేపట్టాలని కోరారు. కరోనా సహాయ చర్యల్లో పాల్గొని ప్రతి బీజేపీ కార్యకర్త సేవలందించాలని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు.