telugu navyamedia
Uncategorized రాజకీయ వార్తలు

ఐటీ రిటర్న్ ల దాఖలుకు జూన్ 30 వరకు గడువు: నిర్మలా సీతారామన్

Nirmala seetharaman

2018-19 ఆర్థిక సంవత్సరం ఐటీ రిటర్న్ ల దాఖలుకు జూన్ 30 వరకు గడువు పెంచినట్టు కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. ఈ వ్యవధిలో పన్ను చెల్లింపుల ఆలస్య రుసుం 12 నుంచి 9 శాతానికి తగ్గిస్తున్నట్టుఆమె తెలిపారు. ఢిల్లీలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి నిర్మలా సీతారామన్ కీలక నిర్ణయాలు ప్రకటించారు. కరోనా వైరస్ వ్యాప్తిని నిరోధించడానికే లాక్ డౌన్ అని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకున్నామని తెలిపారు.

ఆధార్-పాన్ అనుసంధానం గడువును జూన్ 30 వరకు పొడిగిస్తున్నామని ప్రకటించారు. ఆర్థిక ప్యాకేజీపై కసరత్తు దాదాపు కొలిక్కి వచ్చిందని వివరించారు. ఆర్థిక సంవత్సరం చివరిరోజులు కావడంతో వేగంగా స్పందించాల్సి ఉందన్నారు.అంతేకాకుండా, టీడీఎస్ జమలో ఆలస్య రుసుం 18 నుంచి 9 శాతానికి తగ్గించాలని నిర్ణయించినట్టు వెల్లడించారు. వివాద్ పే విశ్వాస్ పథకం గడువు జూన్ 30 వరకు పొడిగిస్తున్నామని తెలిపారు.

Related posts