telugu navyamedia
క్రీడలు వార్తలు

మహిళల ఐపీఎల్ టైటిల్ స్పాన్సర్ గా జియో…

పురుషుల ఐపీఎల్ 2020 చివర్లో అంటే నవంబర్ 4 నుండి 9 వరకు మహిళల ఐపీఎల్ నిర్వహించనున్నట్లు ఈ మధ్యే బీసీసీఐ ప్రకటించింది. ఈ లీగ్ కోసం యూఏఈ  కి వెళ్లిన మహిళా ప్లేయర్స్ కి అక్కడ తమ క్వారంటైన్ ను కూడా ముగించుకొని ప్రాక్టీస్ ప్రారంభించారు. ఈ ఏడాది మహిళల టీ 20 ఛాలెంజ్ కు రిలయన్స్ జియో టైటిల్ స్పాన్సర్ గా వ్యవరించనుంది. అయితే గత రెండు సంవత్సరాలుగా జరుగుతున్న ఈ లీగ్ కోసం బీసీసీఐ ఎప్పుడు ఒప్పందం కుదుర్చుకోలేదు. కానీ ఈ ఏడాది ఇలా మహిళల ఐపీఎల్ టైటిల్ స్పాన్సర్ షిప్ కోసం ప్రత్యేకంగా బీసీసీఐ ఒక ఒప్పందం కుదుర్చుకుంది. ప్రస్తుతం అంతర్జాతీయంగా మహిళల క్రికెట్ కు ఆదరణ పెరుగుతుంది. ఇలాంటి సమయంలో బీసీసీఐ కుదుర్చుకున్న ఈ ఒప్పందం దానిని మరో అడుగు ముందుకు తీసుకెళ్లింది అనే చెప్పాలి. అయితే  నవంబర్ 4 నుండి ప్రారంభమయ్యే ఈ టోర్నమెంట్ ట్రైల్బ్లేజర్స్, సూపర్నోవాస్ మరియు వెలాసిటీ అనే మూడు జట్ల మధ్య జరుగుతుంది. ఇందులో వెలాసిటీకి మిథాలీ రాజ్ నాయకత్వం వహించగా, స్మృతి మంధనా, హర్మన్‌ప్రీత్ కౌర్ వరుసగా ట్రైల్బ్లేజర్స్, సూపర్నోవాస్‌లకు నాయకత్వం వహిస్తున్నారు. ఈ లీగ్ లో కేవలం 4 మ్యాచ్ లు మాత్రమే ఉండటంతో వాటిని షార్జాలోనే నిర్వహించనున్నట్లు బీసీసీఐ తెలిపింది. చూడాలి మరి ఇందులో ఎవరు విజయం సాదితారు అనేది.

Related posts