మేయర్ కుమారుడు పాట్నా మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో ఓ మహిళా కౌన్సిలర్కు కన్ను గీటాడు. పదేపదే నవ్వుతూ కన్నుకొట్టడంతో ఈ విషయాన్ని ఆమె ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఇటీవల నిర్వహించిన పాట్నామునిసిపల్ కౌన్సిల్ సమావేశానికి మహిళా వార్డు కౌన్సిల్ సభ్యురాలు పింకీదేవి హాజరయ్యారు. ఇదే సమావేశానికి వచ్చిన మేయర్ కుమారుడు శిషీర్.. పింకీదేవిని చూసి నవ్వుతూ కన్నుగీటాడు. ఆమె పట్టించుకోకపోవడంతో పదేపదే అదే పనిచేశాడు.
ఈ విషయాన్ని ఆమె మేయర్ దృష్టికి తీసుకెళ్లారు. అయినా ఫలితం లేకపోవడంతో ఆమె నేరుగా ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ దృష్టికి తీసుకెళ్లి ఫిర్యాదు చేశారు. విషయం వెలుగులోకి రావడంతో మేయర్పై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మహిళా కౌన్సిలర్తో అసభ్యంగా ప్రవర్తించిన శిషీర్పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
రామ్గోపాల్ వర్మ సైకో డైరెక్టర్: యామిని