telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

స్వచ్ఛ సర్వేక్షణ్ సర్వేలో పాల్గొనాలి: జనసేన లక్ష్మీ నారాయణ

JD Laxminarayana filed nomination janasena

భారత ప్రభుత్వం నిర్వహిస్తున్న స్వచ్ఛ సర్వేక్షణ్ సర్వేలో విశాఖవాసులంతా పాల్గొనాలని జనసేన నేత, సీబీఐ మాజీ అధికారి లక్ష్మీనారాయణ ట్విట్టర్ లో విన్నవించారు.

“విశాఖ ప్రజలందరికీ నమస్కారం. భారత ప్రభుత్వం 2020 సంవత్సరానికి గాను స్వచ్ఛ సర్వేక్షణ్ కార్యక్రమాన్ని చేపట్టింది. అంటే స్వచ్ఛంగా ఉన్న నగరాలకు ఒక పోటీ నిర్వహిస్తోంది. ఈ పోటీలో మనమంతా పాల్గొని మన నగరాన్ని స్వచ్ఛమైన నగరంగా ప్రతిపాదించడానికి ఒక అవకాశం ఉంది.

దీని కోసం మనం చేయాల్సింది ఇదే. మొదట స్మార్ట్ ఫోన్ లోని యాప్ స్టోర్ ద్వారా mohua swachhata అనే యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవాలి. ఆ తర్వాత అందులో సిటిజన్ సర్వే అనే ఆప్షన్ ను సెలెక్ట్ చేసుకోవాలి. ఇందులో 8 ప్రశ్నలు ఉంటాయి. ఆ 8 ప్రశ్నలకు సమాధానాలిస్తూ మన అభిప్రాయాలను కేంద్ర ప్రభుత్వానికి పంపించాలని విన్నవించారు.

Related posts