హర్యానాలో ఏ పార్టీకి పూర్తి మెజారిటీ రాకపోవడంతో హంగ్ అసెంబ్లీ ఏర్పడింది. దీంతో కింగ్ మేకర్గా అవతరించిన జేజేపీ కీలకంగా మారింది. బీజేపీ, కాంగ్రెస్ మధ్య హోరాహోరీ ఫైట్ సాగింది. 90 స్థానాలు ఉన్న హర్యానాలో.. బీజేపీ 42 స్థానాల్లో.. కాంగ్రెస్ 30 స్థానాల్లో లీడింగ్లో ఉన్నాయి. అయితే అనూహ్యంగా జేజేపీ పార్టీ మాత్రం అధికార పార్టీకి జలక్ ఇచ్చింది. దుశ్యంత్ నేతృత్వంలోని ఆ పార్టీ 10 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నది. దీంతో హర్యానా పోరు రసవత్తరంగా మారింది.
హర్యానాలో ప్రభుత్వ ఏర్పాటుకు 46 సీట్లు కావాలి. మిషన్ 75 టార్గెట్తో బీజేపీ ప్రచారం నిర్వహించినా.. ఆ టార్గెట్ను అందుకోలేకపోయారు. ప్రధాని మోదీ హర్యానాలో ఏడు ర్యాలీలు నిర్వహించారు. ముఖ్యంగా జాట్లు ఉన్న ప్రాంతాల్లో ఆయన పర్యటించారు. ప్రస్తుతం హంగ్ ఏర్పడడంతో.. బీజేపీ కూడా జేజేపీని ఆశ్రయించే అవకాశాలు ఉన్నాయి. అకాలీదళ్, బీజేపీ, జేజేపీ గతంలో కూటమిగా ఏర్పడాలని భావించాయి.