కాకుళం జడ్పీ ఛైర్ పర్సన్ సీసీగా పనిచేస్తున్న సంతోష్ కుమార్, మీడియా సమావేశంలో ఆత్మహత్యాయత్నం చేయడం తీవ్ర కలకలం రేపింది. శ్రీకాకుళం జిల్లా పరిషత్ చైర్మన్ ఈ ఉదయం మీడియాతో మాట్లాడిన ఆయన, జడ్పీ సీఈఓ నగేష్ తనను తీవ్రంగా వేధిస్తున్నాడని ఆరోపిస్తూ పురుగుల మందు తాగారు. ఆ వెంటనే ఆయన్ను స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
పరిస్థితి విషమంగా ఉందని వెల్లడించిన వైద్యులు, రిమ్స్ కు తరలించాలని సూచించారు. సంతోష్ కుమార్ పురుగుల మందు తాగారన్న విషయం బయటకు పొక్కడంతో పట్టణంలో తీవ్ర ఉద్రిక్త వాతావరణ పరిస్థితి ఏర్పడింది. దీంతో పోలీసులు బందోబస్తు ఏర్పాట్లు చేశారు. సంతోష్ ఆరోగ్య పరిస్థితిపై మరింత సమాచారం తెలియాల్సివుంది.
వైఎస్ నైజమే జగన్ లో కనిపించింది: ఉండవల్లి