telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

పూర్తైన ఇళ్లను పేదలకు అందించాలి: కన్నా

Kanna laxminarayana

నిర్మాణాలు పూర్తైన లక్షల ఇళ్లను వెంటనే పేదలకు అందించాలని ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. టీడీపీ హయాంలో ఇళ్ల నిర్మాణంలో భారీ అవినీతి చోటుచేసుకుందని ఆరోపించిన జగన్… సీఎం అయిన వెంటనే ఆ విషయాన్ని మర్చిపోయారని విమర్శించారు. నిర్మాణం పూర్తి కావాల్సిన 2.30 లక్షల ఇళ్లను పూర్తి చేసి ఇళ్లు లేని వారికి కేటాయించాలని డిమాండ్ చేశారు.

దేశంలోని ప్రతి ఒక్కరికీ సొంత ఇల్లు ఉండాలనేది ప్రధాని మోదీ ఆశయమని అన్నారు. ఆ లక్ష్యంతోనే ఏపీకి భారీగా ఇళ్లను మంజూరు చేశారని తెలిపారు. నిర్మాణం పూర్తి చేసుకున్న ఇళ్లను పేదలకు పంచకుండా… ఇళ్ల స్థలాల పేరుతో కాలయాపన చేస్తున్నారని కన్నా విమర్శించారు. ఇళ్ల నిర్మాణంలో టీడీపీ అవినీతికి పాల్పడితే… ఇళ్ల స్థలాల్లో వైసీపీ అవినీతికి పాల్పడుతోందని ఆరోపించారు. ఇళ్ల స్థలాల పేరిట వైసీపీ నేతలు అవినీతికి పాల్పడుతున్నారని అన్నారు. తమ మాట వినలేదనే కారణంతో నెల్లూరు జిల్లా కలెక్టర్ శేషగిరిరావును బదిలీ చేశారని అన్నారు.

Related posts