నిన్న సాయంత్రం ఢిల్లీలో ఇజ్రాయిల్ ఎంబసీకి కూతవేటు దూరంలో బాంబుపేలుళ్లు సంభవించాయి. దీంతో ఢిల్లీ ఉలిక్కిపడింది. అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉన్న ప్రాంతంలో ముష్కరులు ఎలా ప్రవేశించారు, ఎలా బాంబుపేలుళ్లు సంభవించాయి అన్నది ప్రశ్నర్ధకంగా మారింది. అయితే అదే సమయంలో ఢిల్లీలో రాష్ట్రపతి భవన్ వద్ద బీటింగ్ రీట్రీట్ కార్యక్రమం జరుగుతున్నది. వీవీఐపీలు నివసించే ప్రాంతంలో బాంబు పేలుళ్లు ఎలా జరిగాయి అన్నది ప్రశ్నర్ధకంగా మారింది. అయితే, ఈ పేలుళ్ల తరువాత బాంబు క్లూస్ టీమ్ రంగంలోకి దిగి అడుగడుగున పరిశీలించడం మొదలుపెట్టింది. పోలీసులు, ఎన్ఐఏ, భద్రతా బలగాలు ఆ ప్రాంతాన్ని జల్లెడ పట్టాయి. ఇక సీసీటీవీ ఫుటేజ్ లో కొన్ని కీలక ఆధారాలు లభించాయి. పేలుళ్లు జరగడానికి ముందు ఓ క్యాబ్ లో ఇద్దరు వ్యక్తులు అక్కడికి వచ్చినట్టు ఫుటేజ్ లో కనిపించింది. క్యాబ్ డ్రైవర్ ను అదుపులోకి తీసుకొని విచారించగా తనకు తెలిసిన విషయం చెప్పాడు. బ్లాస్టింగ్ జరిగిన ప్రాంతంలో కాలిన పింక్ కలర్ చున్నీ, ఓ చిన్న ఎన్వలప్ కవర్ ను గుర్తించారు. లేఖను ఇజ్రాయిల్ రాయబారిని ఉద్దేశిస్తూ రాసినట్టుగా అధికారులు గుర్తించారు. లేఖలో ఇటీవలే మరణించిన ఇరాన్ అగ్రశ్రేణి కమాండర్ సులేమాని, అణుశాస్త్రవేత్త ఫక్రజాదే పేర్లు ఉన్నాయి. ఇది ట్రైలర్ మాత్రమే అని లేఖలో రాసుంది. దీంతో ఈ పేలుళ్లకు ఇరాన్ తో లింక్ ఉందని అధికారులు అనుమానిస్తున్నారు. చూడాలి మరి ఈ వార్తల పై ఇరాన్ ఏమైనా స్పందిస్తుందా… లేదా అనేది.
previous post
next post
వైసీపీలోకి తోట వచ్చినంత మాత్రాన ఆ కేసును వదలం: సుభాష్ చంద్రబోస్