మురుగదాస్, రజనీకాంత్ కథానాయకుడిగా ఒక సినిమాను రూపొందిస్తున్నాడు. ఈ సినిమాలో రజనీకాంత్ పోలీస్ ఆఫీసర్ గా .. సామాజిక సేవకుడిగా ద్విపాత్రాభినయం చేయనున్నాడు. ఆయన సరసన నయనతారను .. మరో కథానాయికగా కీర్తి సురేశ్ ను తీసుకున్నట్టుగా సమాచారం. ఏప్రిల్ 10వ తేదీ నుంచి ఈ సినిమా షూటింగును మొదలుపెట్టాలనే ఆలోచనలో దర్శక నిర్మాతలు వున్నారు. 2020 సంక్రాంతి కానుకగా ఈ సినిమాను విడుదల చేయాలనే నిర్ణయానికి వచ్చారు.
పోలీస్ ఆఫీసర్ గా రజనీని తెరపై ఆయన అభిమానులు చూసి చాలా కాలమే అయింది. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకున్న మురుగదాస్, ఈ పాత్రను మరింత పవర్ఫుల్ గా తీర్చిదిద్దాడని అంటున్నారు. మొత్తానికి వచ్చే సంక్రాంతికి తెలుగు .. తమిళభాషల్లోని మిగతా సినిమాలకి ఈ సినిమా గట్టిపోటీ ఇవ్వనుంది. మొన్నటి వరకు రజనీ డాన్ పాత్రలలో అలరించారు.. ఇప్పుడు హఠాత్తుగా మళ్ళీ పోలీస్ పాత్రలో కనిపిస్తున్నారు. అయితే ఎన్నాళ్లకు మళ్ళీ రజనీని పోలీస్ డ్రెస్ లో చూస్తున్నామని.. ఇప్పటి నుండే అభిమానులు ఉత్సాహంతో ఉరకలు వేయడం విశేషం.