ఐపీఎల్ పాయింట్ల పట్టికలో ముంబై ఇండియన్స్ అగ్రస్థానంలో ఉండగా.. ఢిల్లీ క్యాపిటల్స్ రెండో స్థానంలో ఉన్న సంగతి తెలిసిందే. ఇవాళ (అక్టోబర్ 9న) రాజస్థాన్ జరిగే మ్యాచ్లో ఢిల్లీ విజయం సాధిస్తే.. క్యాపిటల్స్ తిరిగి తొలి స్థానాన్ని కైవసం చేసుకుంటుంది. ఒక వేళ రాజస్థాన్ గెలిస్తే.. బెంగళూరు, చెన్నైలను వెనక్కి నెట్టి పాయింట్ల పట్టికలో ఐదో స్థానానికి చేరుకుంటుంది. రేపు (అక్టోబర్ 10) కింగ్స్ ఎలెవన్ పంజాబ్తో కోల్కతా, చెన్నై సూపర్ కింగ్స్తో బెంగళూరు తలపడనున్నాయి. కోల్కతా, బెంగళూరు రెండూ విజయం సాధిస్తే.. పాయింట్ల పట్టికలో మూడు, నాలుగో స్థానానికి చేరుకుంటాయి. కానీ ఆదివారం రాజస్థాన్పై సన్రైజర్స్ గెలిస్తే.. మళ్లీ ఇప్పటి పరిస్థితే కొనసాగుతుంది. ఆటగాళ్ల వ్యక్తిగత ప్రదర్శన విషయానికి వస్తే.. 313 రన్స్తో కేఎల్ రాహుల్ ఆరెంజ్ క్యాప్ హోల్డర్గా ఉండగా.. 299 రన్స్తో డుప్లెసిస్ రెండో స్థానంలో, 281 రన్స్తో మయాంక్ మూడో స్థానంలో ఉన్నారు. 12 వికెట్లు తీసిన రబాడ పర్పుల్ క్యాప్ హోల్డర్గా ఉండగా.. బుమ్రా 11 వికెట్లతో రెండో స్థానంలో ఉండగా , బౌల్ట్ 10 వికెట్లతో మూడో స్థానంలో ఉన్నాడు.