telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ఇది గాంధీ 2.0 యుగం… నాగబాబు సెన్సేషనల్ కామెంట్స్

nagababu

ఇది గాంధీ యుగం కాదని, గాంధీ 2.0 యుగమని తెలుపుతూ సోషల్‌ మీడియాలో నాగబాబు ఓ పోస్ట్ పెట్టడం సంచలనంగా మారింది. గత రెండు రోజులుగా సోషల్‌ మీడియాలో నాగబాబుపై తెగ ట్రోలింగ్ నడుస్తోంది. బొమ్మ అదిరింది వివాదం కాస్త జగన్ ఫ్యాన్స్ వర్సెస్ నాగబాబు అన్నట్లుగా మారింది. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని హేళన చేస్తూ బొమ్మ అదిరింది షోలో ఓ స్కిట్ చేయడం, దానిపై నాగబాబు పడి పడి నవ్వడం చూసి వైసీపీ వర్గాలు భగ్గుమన్నాయి. నాగబాబుపై వైసీపీ వర్గాలు ఓ రేంజ్‌లో ఫైర్ అవుతుండటంతో ఈ వివాదం జనాల్లో హాట్ ఇష్యూగా మారింది. ఈ నేపథ్యంలో అస్సలు వెనక్కి తగ్గేదే లేదన్నట్లుగా తనను ట్రోల్ చేస్తున్న వారిపై పరోక్షంగా కామెంట్స్ చేస్తూ ఫైర్ అవుతున్నారు నాగబాబు. ”ఒక చెంప మీద కొడితే ఇంకో చెంప చూపించడం పిరికివాడు లక్షణం, వాడు ఒక చెంప మీద కొడితే నువ్వు వాడి మొహం పగలగొట్టు” అని పేర్కొంటూ తన ఇన్స్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ పెట్టారు నాగబాబు. దీంతో ఈ పోస్ట్ వైరల్ అయింది. దీనిపై నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందన వస్తోంది.

 

View this post on Instagram

 

Gandhi 2•0`20 #NagaBabuTalks

A post shared by Naga Babu Konidela (@nagababuofficial) on

Related posts